గణేష్ మండపాల్లో అన్నదాన కార్యక్రమాలు

నవతెలంగాణ మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని కాపురంపల్లి ఓసిపి బ్లాక్-1లో బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ కంపెనీ ఆధ్వర్యంలో క్యాంపులో కొలువుదీరిన గణేష్ మండపంలో బుధవారం ఏఎమ్మార్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, మైన్ మేనేజర్ మూర్తి,పిఆర్ఓ మల్లేష్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. వేంకటేశ్వర స్వామి ఆలయంలోని గణేష్ మండలంలోని వినాయకుడుకి వివిధ రకాల రంగుల వస్ర్తంతో అలంకరణ చేశారు. అలాగే వివిధ గ్రామాల్లో కొలువుదీరిన గణేష్ మండపాల్లో అన్నదాన కార్యక్రమాలు,కుంకుమ పూజలు నిర్వహించారు.
Spread the love