- Advertisement -
నవతెలంగాణ-కంఠేశ్వర్: నగరంలోని ఐదో పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడి వద్ద 15 గ్రాముల గంజాయిని పట్టుకున్నట్లు ఎస్ఐ గంగాధర్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం..మంగళవారం విశ్వసనీయ సమాచారం మేరకు డ్రైవర్స్ కాలనీ నాగారం వద్ద గంజాయి ప్యాకెట్లు విక్రయిస్తుండగా సాలుంకే రత్నదీప్ అను వ్యక్తి ని పట్టుకున్నామన్నారు. అతని వద్ద 5 ప్యాకెట్ల గంజాయి (సుమారు 15 గ్రాముల గంజాయి )స్వాధీనం చేసుకుని, వాటిని సీజ్ చేసి, కేసు నమోదు చేశానన్నారు. గంజాయిని ఎవరైనా అమ్మిన లేదా కొన్న లేదా త్రాగిన వారిపై కేసు లు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
- Advertisement -