- Advertisement -
నవతెలంగాణ – సిరిసిల్ల : సిరిసిల్ల నియోజకవర్గనికి చెందిన టీవీ9 రిపోర్టర్ గార్దాసు ప్రసాద్ కుటుంబానికి అండగా ఉంటానని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని ప్రసాద్ ఇంటికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరుపున రూ.50 వేల ఆర్థిక సహాయంతో పాటు తన సొంత డబ్బులు రూ. 20 వేలను ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. భవిష్యత్తులో కూడా ఈ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పిల్లల పైచదువులకు అండగా ఉంటానని తెలిపారు. వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
- Advertisement -