- Advertisement -
నవతెలంగాణ- కంఠేశ్వర్ తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులుగా వల్ల మహేందర్ ని నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎస్సీ, ఎస్టీ, బీసీ, ల సమస్యలపై వారికి రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణకై పనిచేయడం జరుగుతుందని తెలిపారు. సంఘం ఆశయాలపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, హక్కుల కొరకై బహుజన మహనీయుల ఆశయాలను సమాజంలోకి తీసుకువెళ్తానని, వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ కృషి చేస్తానని మహేందర్ తెలిపారు.
- Advertisement -