పిల్లలను చదివించటానికి తల్లిదండ్రులు చేస్తున్న కష్టాన్ని మనసులో పెట్టుకొని చదువుపై శ్రద్ధ వహిం చాలని తొగుట సిఐ ఎస్కే లతీఫ్ సూచించారు. బుధవారం ఎల్లారెడ్డిపేట ఉన్నత పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు మహిళల రక్షణ చట్టాలు, యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ సైబర్ నేరాలు, నూత న చట్టాల గురించి తొగుట సిఐ, గజ్వేల్ షీటీమ్ బృందం అవగాహన కల్పించారు. అనంతరం సిఐ మాట్లాడుతూ.. విద్యార్థి దశ కీలకం, జీవితంలో మళ్లీ ఎప్పుడు ఇలాంటి సమయం రాదు. ఏం సాధించాలన్నా ఇప్పటి నుండే ప్రణాళికలు తయా రు చేసుకోవాలన్నారు. అపరిచిత వ్యక్తుల యొక్క ఫోన్ కాల్స్ వారు చెప్పే మాటలు నమ్మవద్దన్నారు. సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే భవిష్యత్ అంత మంచిగా ఉంటుంది తెలిపారు. మహిళల భద్రతకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం. మహిళల భద్రత మా ముఖ్య బాధ్యత అని పేర్కొన్నారు. చదువుకునే సమయములో చెడు అలవాట్లకు బానిస కావొద్దని సూచించారు. అన్నా రు, ప్రతి ఒక్కరూ చదువుపై దృష్టి సారించాలని, డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాలపై అప్ర మత్తంగా ఉండాలన్నారు. కష్టపడి చదవాల్సిన వయస్సులో చెడు అలవాట్లకు బానిసలు కావద్దని వివరించారు. కష్టపడి చదువుకుని ఉన్నత స్థానా ల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. నూతన చట్టాల తో మహిళల రక్షణకు పెద్దపీట, నేరం చేసిన నేర స్తులకు కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నామన్నా రు. బాధితులకు అండగా చట్టాలు నిలుస్తాయని చెప్పారు. మహిళలు, పిల్లలు ఎవరితోటైనా హింసకు పాల్పడిన, హేళనంగా మాట్లాడిన మౌనం వీడి తల్లిదండ్రులకు, స్నేహితులకు చెప్పుకోవాలని అన్నారు. లేనిపక్షంలో డయల్-100 కు కాల్ చేసి తక్షణం పోలీస్ సహాయం పొందాలన్నారు. పిల్లలు మహిళలు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటే వెంట నే షిటీమ్ వాట్సప్ నెంబర్ 8712667343, మహి ళా పోలీస్ స్టేషన్ నెంబర్ 8712667435 సమా చారం అందించాలని కోరారు. సమాచార అందిం చిన వారి పేర్లు గోప్యంగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాటశాల ప్రధానోపాధ్యాయులు మండల విద్యాధికారి నర్సయ్య, ఉపాధ్యాయులు, గజ్వేల్ షీటీమ్ ఏఎస్ఐ శ్రీరాములు, మహిళా కాని స్టేబుల్ శ్యామల, కానిస్టేబుల్ రామచంద్రారెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.