మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి: డీఆర్డీఏ పీడీ కిషన్ 

Women should be economically developed: DRDA PD Kishanనవతెలంగాణ – జన్నారం
మహిళల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంచిర్యాల జిల్లా డీఆర్డీఏ పీడీ కిషన్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని  ఐకేపీ కార్యాలయంలో ఆర్ ఎస్ ఈ  టి ఐ సంస్థ ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన జ్యూట్ బ్యాగ్ తయారీ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ..  మహిళలు స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి పథంలోపయనించాలన్నారు. ఈ జ్యూట్ బ్యాగుల తయారీలో దాదాపు 35 మందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ  శిక్షణ తీసుకొని స్వయం ఉపాధి పెంపొందించుకొనుటకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో  మండల తాసిల్దార్ రాజ మనోహర్ రెడ్డి, ఎంపీడీవో శశికళ అదేవిధంగా ఆర్ ఎస్ ఈ టి ఐ  సంస్థ డైరెక్టర్ మహమ్మద్ గౌస్ . జాబ్స్ జేడియం  రామ్ చందర్,  ఏపీఎం బుచ్చన్న  మండల సమైక్య అధ్యక్షురాలు సప్న ట్రైనర్స్  ఆశన్న రమేష్ సతీష్ పాల్గొన్నారు.
Spread the love