- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: గాజాలో ఆహారం కోసం వేచి ఉన్న వందల మందిపై ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరిపింది. ఈ దాడిలో 85 మంది మృతి చెందారు. 150 మందికి పైగా గాయపడ్డారు. జికిం ప్రాంతంలో ఉత్తర గాజాకు వెళ్లే ఆహార ట్రక్కుల కోసం వేచి చూస్తున్న వారిపై దాడి జరిగింది. గాయపడినవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఇజ్రాయెల్ సైన్యమే కాల్పులకు కారణమని ప్రత్యక్ష సాక్షులు, ఐక్యరాజ్య సమితి తెలిపారు.
- Advertisement -