వేసవి కాలం… ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ సమయంలో మనం ఎక్కువగా డీహైడ్రేషన్ బారిన పడతాం. దాని నుండి బయటపడటానికి ఎక్కువగా నీళ్లు, జ్యూస్ తాగడం, పళ్లు తినడం లాంటివి చేయాలి. ఎండాకాలంలో వేడి నుండి ఉపశమనం కలిగించే పండ్లలో కర్బూజ ఒకటి. ఇది దోస జాతికి చెందిన ఫ్రూట్. దీనిని తినడంతోపాటు జ్యూస్ కూడా తాగుతారు. ఈ పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
– కర్భూజ పండు తినడం వల్ల బాడీ డీహైడ్రేషన్కు గురికాకుండా ఉంటుంది.
– గుండెల్లోని మంటలను తగ్గించడంలో ఈ పండు బాగా పనిచేస్తుంది.
– ఇందులో ఉండే యాంటియాక్సిడెంట్లు ఊబకాయాన్ని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అంతేకాకుండా శరీర కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
– ఈ పండులో అధిక మొత్తంలో ఆర్గానికి ఫిగ్మెంట్ కెరోటినాయిడ్ ఉంటుంది. ఇది క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది.
– కర్బూజలో విటమిన్-ఏ, బీటా కెరొటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కళ్ల పనితీరును మెరుగుపరుస్తుంది.
– ఇది బీపీని కంట్రోల్ లో ఉంచుతుంది. అంతేకాకుండా ఆజీర్తి, మూత్ర సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది.