నవతెలంగాణ – బజార్ హాత్నూర్
రైతులు తమ పశువులకు సోకే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మండల పశువైద్యాధికారి పర్వీజ్ అహ్మద్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పశువైద్యాశాలలో ఉచిత లంపి స్కిన్ (ముద్ద చర్మ వ్యాధి) నివారణ టీకాల శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువుల్లో వచ్చే సీజనల్ వ్యాధులైన లంపి స్కిన్ ( ముద్ద చర్మ వ్యాధి) బ్ల్యూటంగ్ (నీలి నాలుక వ్యాధులపై రైతులకు అవగాహన కల్పించారు. ముద్దపు చర్మవ్యాధి సోకితే పాడి రైతుకు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లుతుందని, పాల దిగుబడి గణనీయంగా తగ్గి రైతుకు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగులుతుందని అన్నారు. అనంతరం పశువుల్లో, గొర్రెలకు ఈ వ్యాధి నివారణ టీకాలను వేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.
పశువుల్లో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES