- Advertisement -
హైదరాబాద్ : నగరానికి చెందిన ప్రముఖ వజ్రాభరణ సంస్థ కీర్తిలాల్స్కు రిటైల్ జ్యువెలర్ ఇండియా అవార్డ్స్ 2025లో ”నేచురల్ డైమండ్ ఇయర్ రింగ్స్ ఆఫ్ ది ఇయర్” ప్రత్యేక అవార్డు లభించింది. ఈ అవార్డును అతిథులైన ప్రమోద్ మెహతా, పులికిట్ మెహతా చేతుల మీదుగా కీర్తిలాల్స్ బిజినెస్ స్ట్రాటజీ డైరెక్టర్ సూరజ్ శాంతకుమార్, అందుకున్నారు.
అవార్డు ఆభరణాల హస్తకళ, ఆవిష్కరణలలో కీర్తిలాల్స్ నిబద్ధతకు గుర్తింపుగా నిలిచిందని శాంతకుమార్ తెలిపారు.
- Advertisement -