Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
HomeNewsఎయిరిండియా కీల‌క నిర్ణ‌యం..

ఎయిరిండియా కీల‌క నిర్ణ‌యం..

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: దిల్లీ- వాషింగ్టన్‌ డీసీ మధ్య విమాన సర్వీసులను నిలిపివేయనున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వస్తుందని, ఆపరేషనల్‌ సంబంధిత పరిమితుల దృష్ట్యా ఈ రూట్‌లో సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. 26 బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌ విమానాలకు రెట్రోఫిట్‌ చేపడుతున్నందున విమానాల కొరత ఉంటుందని, పాకిస్థాన్‌ గగనతలం మూసివేత ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిరిండియా పేర్కొంది. విమానాల కొరత కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. గత నెలలోనే బోయింగ్‌ 787-8 విమానాలు రిట్రోఫిట్‌ చేయడం ప్రారంభించినట్లు పేర్కొంది. సెప్టెంబర్‌ 1 తర్వాత వాషింగ్టన్‌ డీసీకి లేదా అక్కడి నుంచి దిల్లీకి టికెట్లు బుకింగ్‌ చేసుకున్న ప్రయాణికుల్ని సంప్రదించి.. వారి వ్యక్తిగత ప్రాధాన్యతల ప్రకారం ఇతర విమానాల్లో రీబుకింగ్‌ లేదా పూర్తి రిఫండ్‌ సహా ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లను సైతం అందిస్తామని తెలిపింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img