Sunday, May 4, 2025
Homeతెలంగాణ రౌండప్ఒక్క సిరాచుక్క లక్షల మెదళ్లకు కదలిక

ఒక్క సిరాచుక్క లక్షల మెదళ్లకు కదలిక

- Advertisement -

ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం
ఆర్టీఐ జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్
నవతెలంగాణ – మల్హర్ రావు: ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని మే 3న యునెస్కో నిర్వహించిందని కాటారం మండల కేంద్రంలో యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్ అన్నారు. కాటారం సబ్ డివిజన్ కన్వీనర్ చింతల కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలో మాట్లాడారు. ఆఫ్రికా ఖండంలోని నమీబియా దేశపు విండో హాక్ నగరంలో 1991ఇ ఏప్రిల్ 29 నుండి మే 3 వరకు నిర్వహించిన సమావేశంలో పత్రికాస్వేచ్చకు సంబంధించిన పలు తీర్మానాలను చేశారని చెప్పారు. స్వేచ్ఛాయుతమైన స్వాతంత్రమైన ప్రపంచ వ్యాప్తంగా బహుళ జాతులను సమన్వయానికి మాధ్యమంగా ప్రజాస్వామ్యం వర్ధిల్లడానికి ఆర్థిక అభివృద్ధిని పౌరుల ప్రాథమిక హక్కు అయినా పత్రికా స్వేచ్ఛను పరిఢ విల్లడం అవసరం. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ప్రపంచ పత్రికా దినోత్సవం డిసెంబరు 1993 ప్రకటించిందన్నారు. ఐక్యరాజ్య సమితి 19 ఆర్టికల్ లోనే పత్రికా స్వేచ్ఛను సంబంధించిన మూలాలను ఇమిడి ఉన్నాయి. బావ స్వేచ్ఛ ప్రకటన స్వేచ్ఛగా అభిప్రాయాలను కలిగి ఉండటం ప్రపంచంలో పత్రిక పౌరుని ప్రాథమిక హక్కు. ఈ హక్కులను ఇతరులు దయాదాక్షిణ్యాలతో వచ్చినవి కావు. మన రాజ్యాంగంలో కూడా ప్రాథమిక హక్కులను చర్చించి రాజకీయాల్లోనే పరిపాలన లోనూ స్వేచ్ఛత విలసిల్లడానికి, పరిగెత్తు కాలంలో సమాంతరంగా ప్రజలకు ముంగిటికి వార్తలను అందించే విలేకరులు. పత్రికా స్వేచ్ఛ ప్రతి సమాజానికి వ్యక్తి జీవనానికి అత్యంత కీలకమైనదన్నారు. ఆ దేశంలో కానీ సమాజంలో కానీ పత్రికా స్వేచ్ఛను నియంత్రించి ఉంటే ఆ సమాజానికి అంధకారంలోకి నెట్టిన పత్రికాస్వేచ్ఛ పారదర్శకతను తద్వారా సుపరిపాలన పెంపొందించింది. పత్రికా స్వేచ్ఛను అనుసంధానము చేసే వారధి వంటిది జాతుల సంస్కృతులను మధ్య భావ మార్పిడికి వంటి అభివృద్ధి కి పత్రికాస్వేచ్ఛ తప్పనిసరి ప్రజల కోసం పత్రిక స్వేచ్ఛ కోసం ప్రజల కోసం పత్రికా స్వేచ్ఛ కోసం కృషి చేస్తున్నారని, వెంకటేశ్వర్లు గౌడ్ ప్రపంచ పత్రికా దినోత్సవం పాత్రికేయ మిత్రులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -