- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తిరుపతిలో దారుణం జరిగింది. కేర్ టేకర్ వృద్ధురాలిని హత్య చేసి బంగారం ఎత్తుకెళ్లాడు. శివ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి రేణిగుంట రోడ్డులోని ఓ విల్లాస్ లో తండ్రి షణ్ముగం, మేనత్త ధనలక్ష్మిలతో కలిసి ఉంటున్నాడు. శివ తండ్రి షణ్ముగం పక్షవాతంతో బాధపడుతున్నారు. అతడిని చూసుకునేందుకు కేర్ టేకర్ రవిని నియమించుకున్నారు. అతడు శుక్రవారం ఇంట్లో నిద్రపోతున్న ధనలక్ష్మి గొంతు కోసి, 8 గ్రాముల బంగారు కమ్మలతో పారిపోయాడు.
- Advertisement -