Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్ఆష్టలో మొక్కలు నాటిన నాయకులు

ఆష్టలో మొక్కలు నాటిన నాయకులు

- Advertisement -

నవతెలంగాణ -ముధోల్ : ముధోల్ మండలంలోని ఆష్ట గ్రామంలో గురువారం రోజు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ జన్మదిన సందర్భంగా బిజెపి నాయకులు, అభిమానులు మొక్కలు నాటారు. స్థానిక పాఠశాల,  రామాలయ ఆవరణలో పండ్లు ,పూలమొక్కలను నాటి ఎమ్మెల్యే కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముధోల్ నియోజక వర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే నిరంతరం కృషి చేస్తున్నారని వారు కొనియాడారు. ఈకార్యక్రమంలో బిజెపి నాయకులు పట్టేపురం సతీష్ రెడ్డి, అరవింద్ రెడ్డి, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad