- Advertisement -
నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంహాలియా పట్టణంలోని యాదవ సంఘం నాయకులు బత్తుల తిరుపతయ్య యాదవ్ శనివారం గుండెపోటుతో మరణించారు. అట్టి విషయం తెలుసుకొని వారి నివాసానికి వెళ్ళి హైకోర్టు న్యాయవాది ఏకే ఫౌండేషన్ చైర్మన్ కట్టెబోయిన అనిల్ కుమార్ వారి పార్దివ దేహానికి పూలమాల వేసి నివాళులు ఆర్పించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు బూడిద గోవింద్,యాదవ్, పిల్లి సైదులు యాదవ్, వెంకటయ్య ముదిరాజ్, శంకర్ యాదవ్, మన్నెం కోటి యువత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -