- Advertisement -
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ఫలితాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నారు. గతంలో ప్రకటించిన గ్రూప్ 1 మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను రద్దు చేస్తున్నట్టు హైకోర్టు తీర్పు ఇచ్చిందని, జీవో నంబర్ 29 రద్దు చేయాలి, మెయిన్స్ సెలక్షన్స్ లో రిజర్వేషన్స్ పాటించలేదనీ, తెలుగు మీడియం విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందనీ అన్నారు. రివాల్యుయేషన్ కాకుండా గ్రూప్ 1మెయిన్స్ పరీక్షలు మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం మాదిరిగా టీజీపీఎస్సీ అవకతవకలు పాల్పడకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని , వెంటనే ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు.
- Advertisement -