‘డైరెక్టర్ అరుణ్ ప్రభు చెప్పిన కథ చాలా బాగుంది. ఆయన అంతకుముందు తీసిన రెండు సినిమాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ‘భద్రకాళి’కి ఆయన ఒక బ్యాక్ బోన్. ఈ సినిమాలో మంచి వినోదంతో పాటు ప్రేక్షకులను ఆలోచింపచేసే అంశాలు కూడా ఉన్నాయి. సినిమా ఇంత అద్భుతానికి రావడానికి కారణం డైరెక్టర్ విజన్’ అని నిర్మాత రామాంజనేయులు జవ్వాజీ చెప్పారు.
హీరో విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ విజయం తర్వాత ‘భద్రకాళి’తో వస్తున్నారు. ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 19న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత రామాంజనేయులు జవ్వాజీ ఆదివారం మీడియాతో ముచ్చటించారు.
విజయ్ ఆంటోనీ, నేను ఎప్పటినుంచో మంచి మిత్రులం. విజయ్ ఆంటోనీ ఫిలిం ఫ్యాక్టరీ, మా బ్యానర్ సర్వంత్ రామ్ క్రియేషన్స్ సంయుక్తంగా సినిమాలు చేయాలని ప్రయాణం మొదలుపెట్టాం. ఇందులో భాగంగా ‘మార్గాన్’ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ‘భద్రకాళి’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం.
ఇది విజయ్ ఆంటోనీకి 25వ సినిమా. మంచి బడ్జెట్, అద్భుతమైన కంటెంట్తో వస్తున్న సినిమా ఇది. తమిళం, తెలుగు, కన్నడ, హిందీలో ఒకేసారి రిలీజ్ చేస్తున్నాం.
సినిమాకి ‘భద్రకాళి’ అనే టైటిల్ పెట్టాం. సరిగ్గా దసరా నవరాత్రులు సమయంలోనే ఈ సినిమా రావడం బాగా ప్లస్ అవుతుందని ‘మార్గాన్’ సినిమాని రిలీజ్ చేసిన మా డిస్ట్రిబ్యూటర్స్ చెప్పారు. ‘మార్గన్’ కంటే ఈ సినిమాకి 20% థియేటర్స్ పెరిగే అవకాశం ఉందని వారు చెప్పడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.
పొలిటికల్ బ్యాక్డ్రాప్లో చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమాలో హీరో చేసిన క్యారెక్టర్తో ఇప్పటివరకు ఎలాంటి సినిమా రాలేదు. సమాజంలో జరుగుతున్న విషయాల్ని బేస్ చేసుకుని తీసిన సినిమా. అందరూ పర్సనల్గా కనెక్ట్ అవుతారు. ఫస్ట్ కాపీ చూసిన తర్వాత చాలా ఆనందంగా అనిపించింది. మేము ఊహించిన దాని కంటే అద్భుతంగా వచ్చింది. సినిమా మొదలైన రెండు నిమిషాల్లోనే ప్రేక్షకులు కథలో లీనమైపోతారు. విజయ్ ఆంటోని అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సాంగ్స్కి చాలా మంచి రీచ్ వచ్చింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్ట్స్ లెవెల్లో ఉంది.
తెలుగులో సత్యదేవ్ గారితో ఫుల్ బాటిల్ అనే సినిమా చేస్తున్నాం. అది కంప్లీట్ అయి రెడీగా ఉంది. నవంబర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఇటీవలే ‘బూకి’ అనే సినిమాని మొదలుపెట్టాం. అలాగే మలయాళంలో ఒక సినిమా చేస్తున్నాం. అది చివరి దశకు వచ్చింది. ‘బిచ్చగాడు’ డైరెక్టర్ శశి, విజయ్ ఆంటోని కాంబినేషన్లో ఒక భారీ ప్రాజెక్ట్ ఉంటుంది. త్వరలో అనౌన్స్ చేస్తాం.
నిర్మాత రామాంజనేయులు జవ్వాజీ