- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ లోని బొల్లారం రైల్వేస్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురిని రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల వివరాలతో పాటు ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
- Advertisement -