- Advertisement -
మండల ఎంఈఓ లక్ష్మన్ బాబు
నవతెలంగాణ – మల్హర్ రావు
కాటారం మండల కేంద్రంలో శనివారం ఎస్జిఏఫ్ఐ కాటారం డివిజన్ స్థాయి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ తదితర ఆటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మండల విద్యార్థులు కబడ్డీ ప్రథమ స్థానంలో బాలికలు, ద్వితీయ స్థానంలో బాలురు, ఖొఖోలో ద్వితీయ స్థానంలో బాలికలు, బాలురు, వాలీబాల్ ద్వితీయ స్థానంలో బాలురు డివిజన్ స్థాయిలో గెలుపొందారని ఎంఈఓ లక్ష్మన్ బాబు తెలిపారు. ఆటల్లో రాణించిన మండల విద్యార్థులను ఎంఈఓ తోపాటు పలువురు అభినందించారు.
- Advertisement -