- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఖలిస్తానీ ఉగ్రవాది ఇంద్రజీత్ సింగ్ గోసల్ను కెనడాలోని అట్టావాలో అరెస్టు చేశారు. సిఖ్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) వ్యవస్థాపకుల్లో ఒకరైన గుర్పత్వంత్ సింగ్ పన్నూకు ఇంద్రజీత్ అత్యంత సన్నిహితుడు. గత 2023 నుంచి ఎఫ్.ఎఫ్.జె కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇంద్రజీత్పై ఆయుధాలు కలిగి ఉండటం సహా పలు అభియోగాలు ఉన్నాయి. భారత-కెనడా ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడుతున్న తరుణంలో ఈ అరెస్టు చోటుచేసుకోవడం గమనార్హం.
- Advertisement -