- Advertisement -
నవతెలంగాణ – వెల్దండ
తెలంగాణ వీరనారి చిట్యాల ఐలమ్మ జయంతి పురస్కరించుకొని శుక్రవారం మండల పరిధిలోని కుప్పగండ్ల గ్రామంలో ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటం ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే వెళ్ళండి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుప్పగండ్ల మాజీ సర్పంచ్ ముక్తాల శేఖర్ , సింగరేణి డైరెక్టర్ వెంకటయ్య గౌడ్, గ్రామ పెద్దలు గ్రామ యువకులు , బి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -