- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బంగారం ధరలు శనివారం మళ్లీ పెరిగాయి. బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.550 పెరిగి రూ.1,05,850కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.600 పెరిగి రూ.1,15,480 పలుకుతోంది. వెండి ధర భారీగా పెరిగి మరోసారి ఆల్ టైం రికార్డుకు చేరింది. కేజీ వెండిపై ఏకంగా రూ.6,000 పెరగడంతో రూ.1,59,000 వద్ద ధర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.
- Advertisement -