- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కరూర్ తొక్కిసలాట ఘటనపై హీరో విశాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘యాక్టర్/పొలిటీషియన్ విజయ్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 30 మందికి పైగా మరణించారని తెలిసి హృదయం తరుక్కుపోతోంది. అమాయకులు ప్రాణాలు పోవడం బాధాకరం. బాధిత కుటుంబాలకు TVK పార్టీ పరిహారం ఇవ్వాలి. మీరు చేయగలిగేది అదొక్కటే. ఇకముందు జరిగే పొలిటికల్ ర్యాలీల్లోనైనా సేఫ్టీపై దృష్టి పెడతారని ఆశిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.
- Advertisement -