నవతెలంగాణ -సుల్తాన్ బజార్
గోషామహల్ సర్కిల్ కార్యాలయం దసరా పండుగను పురస్కరించుకొని మహిళా ఉద్యోగులు తెలంగాణ సాంస్కృతిక స్ఫూర్తితో వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఉమా ప్రకాష్ పాల్గొని మాట్లాడుతూ.. సర్కిల్ లో పనిచేస్తున్న మహిళ ఉద్యోగులు ఎంతో శక్తివంతులని అన్నారు. మహిళా సాధికారతో ముందు కెళుతున్నమన్నారు.
ఈ ఏడాది వేడుకలు “స్త్రీ శక్తి” ముందుకెళ్తున్నామన్నారు. ప్రతి రంగంలో మహిళల బలం, అంకితభావంతో దుర్గాదేవి ధైర్యశక్తిని ఉద్యోగులకు ఇవ్వాలని కోరుకున్నట్టు తెలిపారు. గోషామహల్ సర్కిల్ మహిళా సిబ్బంది సంకల్పం, ఐక్యతతో ముందుకు సాగుతున్నామన్నారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులు డిప్యూటీ కమిషనర్ ఉమా ప్రకాష్ కు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.