- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు.
మండలంలోని రుద్రారం గ్రామానికి నస్పూరి నాగరాజు కాంగ్రెస్ పార్టీ మంథని డివిజన్ సోషల్ మీడియా ఇంచార్జిగా ఉన్న అతను అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే నాగరాజు 10వ తరగతి మిత్రులు బుధవారం నాగరాజు స్మారక మండల స్థాయి క్రికెట్ టోర్నీ నిర్వహించారు.ఈ పోటీల్లో గెలుపొందిన ప్రథమ జట్టుకు రూ.5016, ద్వితీయ జట్టుకు రూ.2016 నగదు అందజేశారు. నాగరాజు ఆశయాలకు అనుగుణంగా స్మారకార్థం మరిన్ని స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా అతని పూర్వ మిత్రులు తెలిపారు
- Advertisement -