* పంట పొలాల నుండి నీటిని తెచ్చుకున్న గ్రామస్తులు
* వాటర్ ట్యాంక్ ఉన్న కలెక్షన్స్ సు..
నవతెలంగాణ నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండలంలోని అక్కంపల్లి గ్రామంలో గురువారం రోజు పండగపూట గ్రామస్తులు నీరు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామంలో వాటర్ ట్యాంక్ ఉంది. దానికి సంబంధించి రెండు బోర్లు ఉన్నాయి. కానీ ఒక బోర్ మోటార్ కాలిపోవడం జరిగింది ఇంకో బోర్ మోటార్ కు విద్యుత్ కలెక్షన్ లేకపోవడంతో వాటర్ ట్యాంక్ లోకి నీరు రాలేదు.
మిషన్ భగీరథ ద్వారా అందిస్తున్న నీరు రంగు మారి రావడంతో పండగ పూట గ్రామస్తులకు నీటి కొరకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సంబంధిత అధికారులు గ్రామస్తులకు కావాల్సిన సదుపాయాలు కల్పించకపోవడంతో పంట పొలాల నుండి పండగ పూట నీరు తెచ్చుకొని పండగ జరుపుకోవాల్సి వచ్చిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇకనైనా సంబంధిత అధికారులు నీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు పేర్కొన్నారు. తరచూ గ్రామంలో నీటి సమస్య ఏర్పడుతుందని శాశ్వత పరిష్కారం చేయాలని గ్రామస్తులు పేర్కొన్నారు.