నయనతార, దర్శకుడు సుందర్ సి దర్శకత్వంలో రూపొందిన ‘మూకుతి అమ్మన్ పార్ట్ 1’ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దీనికి సీక్వెల్గా వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, ఐవీ ఎంటర్టైన్మెంట్తో కలిసి బిగ్గెస్ట్ పాన్ ఇండియా ఎంటర్టైనర్గా ‘మూకుతి అమ్మన్ 2’ను నిర్మిస్తోంది. అవ్ని సినిమాక్స్ (పి) లిమిటెడ్, రౌడీ పిక్చర్స్ సహ నిర్మాతలు. తెలుగు డబ్బింగ్ వెర్షన్ ‘అమ్మోరు తల్లి’కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ లభించింది. దసరా శుభ సందర్భంగా ‘మూకుతి అమ్మన్ 2’ తెలుగు టైటిల్ని అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి ‘మహాశక్తి’ అనే టైటిల్ పెట్టారు. నయనతారని అమ్మవారి రూపంలో ప్రజెంట్ చేసిన ఫస్ట్ లుక్ పవర్ ఫుల్గా ఉంది. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ డాక్టర్ ఇషారి కె గణేష్ ఐవీ ఎంటర్టైన్మెంట్తో కలిసి ‘మహాశక్తి’ని భారీ స్థాయిలో విజువల్ వండర్గా నిర్మిస్తున్నారు.
‘మూకుతి అమ్మన్ 2’ అన్ లిమిటెడ్ నవ్వులతో కూడిన ఎక్సయిటింగ్ కథాంశంతో ఉంటుంది. సుందర్ సి, నయనతార తొలిసారి కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. నయనతార లీడ్ రోల్లో నటిస్తుండగా, దునియా విజయ్, రెజీనా కాసాండ్రా, యోగి బాబు, ఊర్వశి, అభినయ, రామచంద్ర రాజు, అజయ్ ఘోష్, సింగం పులి, విచ్చు విశ్వనాథ్, ఇనియా, మైనా నందిని ఈ చిత్రంలో ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి హిప్ హాప్ ఆది సంగీతం అందిస్తున్నారు. గోపీ అమర్నాథ్ సినిమాటోగ్రాఫర్, ఫెన్నీ ఆలివర్ ఎడిటర్. వెంకట్ రాఘవన్ సంభాషణలు అందిస్తున్నారు, గురురాజ్ ఆర్ట్ వర్క్లను పర్యవేక్షిస్తున్నారు. రాజశేఖర్ యాక్షన్ సన్నివేశాలను కొరియోగ్రఫీ చేస్తున్నారు. ‘మహాశక్తి’ ఎగ్జైటింగ్ యాక్షన్, బలమైన కథాంశం, అన్ లిమిటెడ్ నవ్వులతో కూడిన పూర్తి స్థాయి ఎంటర్టైనర్గా ఉంటుంది. ఈ చిత్రం అన్ని దక్షిణ భారత భాషలు, హిందీలో పాన్ ఇండియా విడుదల కానుంది అని చిత్ర యూనిట్ తెలిపింది.
‘మహాశక్తి’గా నయనతార
- Advertisement -
- Advertisement -