Sunday, October 5, 2025
E-PAPER
Homeకరీంనగర్స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించండి..

స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించండి..

- Advertisement -

నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ పేర్కొన్నారు. సిరిసిల్లలోని
కార్మిక భవనంలో జరిగిన  సమావేశంలో  ఆయన మాట్లాడుతూ.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీపీఐ(ఎం) కార్మిక కర్షక బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడి అనేక పోరాటాలు నిర్వహిస్తూ వస్తుందని, కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్ పార్టీలు తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నాయని ఆయన అన్నారు.  ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఏ ఒక్క పార్టీ కూడా నిజాయితీగా ప్రజల కొరకు పనిచేసిన దాకాలు లేవని అన్నారు. ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చి ఎన్నికల అయిన తర్వాత హామీలను అమలు చేయకుండా తుంగలో తొక్కేయడం  పెట్టుబడిదారి పార్టీలకు ఆనవాయితీగా మారిందని తెలిపారు.

చట్టసభల్లో కమ్యూనిస్టు పార్టీల ప్రాతినిధ్యం తగ్గిపోవడంతో విచ్చలవిడిగా అవినీతి రాజ్యమేలుతున్న పేదల సమస్యలు పరిష్కారం కావడం లేదని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూ అక్రమాలు ఇసుక మాఫియా, ప్రకృతి సంపద దోచుకోవడం, రోజురోజుకు పెరిగిపోయిన ప్రశ్నించే గొంతుక లేకపోవడం వలన అవినీతి రాజ్యమేలుతుందనీ  ఆయన పేర్కొన్నారు. ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని వాపోయారు. నీతికి నిజాయితీకి క్రమశిక్షణకు మారుపేరైనటువంటి సీపీఐ(ఎం) అభ్యర్థులను ప్రజా సమస్యల పరిష్కారం కొరకురాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించాలని, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజానీకానికి సీపీఐ(ఎం) జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తుందన్నారు.

ఈ సమావేశంలో సీపీఐ(ఎం) కార్యదర్శి వర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి, కోడం రమణ, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు సూరం పద్మ, శ్రీరాముల రమేష్, చంద్ర ,సీపీఐ(ఎం) నాయకులు సందు పట్ల పోచమ్మల్లు, గడ్డం రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -