నవతెలంగాణ – బల్మూరు
మండలంలోని కొండనాగుల గ్రామ సహకార సంఘం పూర్తి సబ్సిడీతో వేరుశనగ విత్తనాలను పంపిణీ చేశారు. ఎన్ ఎం ఈ ఓ- ఓఎస్ పథకం ద్వారా 100% సబ్సిడీతో విత్తనాలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎం ఎం ఈ ఓ- ఓఎస్ ( నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్- ఆయిల్ సీడ్స్) పథకం ద్వారా రైతులకు 100% సబ్సిడీతో వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. సబ్సిడీ వేరుశనగ విత్తనాలు కావాలనుకునే రైతులు పట్టాదారు పాసుబుక్కు జిరాక్స్లు రెండు సెట్లు, ఆధార్ కార్డు జిరాక్స్లు రెడ్ సెట్లు, పాస్పోర్ట్ సైజు ఫోటోలు రెండు ఎస్ పి ఓ సభ్యత్వం కలిగి ఉండాలని తెలిపారు. అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కావేటి నరేష్, పిఎసిఎస్ సీఈఓ రాజవర్ధన్ రెడ్డి రైతులు పాల్గొన్నారు.
పూర్తి సబ్సిడీతో వేరుశనగ పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES