Thursday, October 9, 2025
E-PAPER
Homeతాజా వార్తలుసోలార్ విద్యుత్ వినియోగంపై ఆసక్తిగా ఉన్నాం

సోలార్ విద్యుత్ వినియోగంపై ఆసక్తిగా ఉన్నాం

- Advertisement -
  • జర్మనీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ రంగం బలోపేతంలో భాగంగా సోలార్ విద్యుత్తు ఉత్పత్తి, వినియోగంలో ఆసక్తిగా ఉన్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో జర్మనీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం సమావేశమయ్యారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోలార్ రంగం పై ఆసక్తిగా ఉందని తెలుసుకొని కొన్ని ప్రతిపాదనలతో వచ్చినట్టు జర్మనీ ప్రతినిధులు తెలిపారు. రాష్ట్రంలో 29 లక్షల వ్యవసాయ పంపుసెట్లు, 200 యూనిట్ల వరకు గృహజ్యోతి పథకం కింద ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం అని డిప్యూటీ సీఎం జర్మనీ ప్రతినిధులకు వివరించారు. రాష్ట్రంలోని వ్యవసాయ పంపుసెట్ల తోపాటు గృహ జ్యోతి లబ్ధిదారులకు సోలార్ విద్యుత్ అందించాలని ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా రైతులు, గృహ జ్యోతి వినియోగదారులకు ప్రతినెలా ఖచ్చితమైన ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన అని తెలిపారు.

జర్మన్ ప్రతినిధులు సూచించిన సోలార్ సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అనుసంధానం చేసుకోగలం, తెలంగాణ విద్యుత్ రంగాన్ని ఆర్థికంగా, సాంకేతికంగా బలోపేతం చేసుకోవడానికి జర్మన్ బృందం ప్రతిపాదనలు ఏ మేరకు ఉపయోగపడతాయో అధ్యయనం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ ను ఆదేశించారు.

జర్మనీ ప్రతినిధులు తీసుకొచ్చిన ప్రతిపాదనలపై అధ్యయనం చేసి ఓ నివేదిక రూపొందించాలని విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ ను డిప్యూటీ సీఎం ఆదేశించారు. సమావేశంలో ట్రాన్స్కో సీఎం డి కృష్ణ భాస్కర్, ఎస్పీడీసీఎల్ సిఎండి ముషారఫ్ ఫారుకి, రెడ్కో సిఎండి అనిలా, జర్మన్ ప్రతినిధులు డాక్టర్ సెబాస్టియన్, డాక్టర్ రఘు చలిగంటి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -