Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంమాట తప్పడం వారి నైజం: ఎంపీ శశిథరూర్

మాట తప్పడం వారి నైజం: ఎంపీ శశిథరూర్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: “మాట తప్పడం వారి నైజం, వారి వాగ్దానాలను ఎలా నమ్మను?” అంటూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ శనివారం పాకిస్థాన్‌పై తనదైన శైలిలో కవితాత్మకంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, కాల్పుల విరమణకు అంగీకరించిన కొన్ని గంటల్లోనే పాకిస్థాన్ దానిని ఉల్లంఘించడంపై ఆయన ఈ విధంగా స్పందించారు. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని భారత్, పాకిస్థాన్ అంగీకరించాయి. అయితే, ఈ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించిందని, దానికి భారత సాయుధ బలగాలు తగిన రీతిలో జవాబిచ్చాయని భారత్ శనివారం రాత్రి ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో శశిథరూర్, శనివారం రాత్రి పొద్దుపోయాక ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఒక హిందీ ద్విపదను పోస్ట్ చేశారు. “ఉస్కీ ఫిత్రత్ హై ముకర్ జానే కీ, ఉస్కే వాదే పే యకీన్ కైసే కరూ?” (#ceasefireviolated అనే హ్యాష్‌ట్యాగ్‌తో) అని పేర్కొన్నారు. “మాట తప్పడం వారి నైజం, వారి వాగ్దానాలను ఎలా నమ్మను?” అని దీనికి అర్థం.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad