- Advertisement -
నవతెలంగాణ – దుబ్బాక
పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా అక్బర్ పేట భూంపల్లి మండలం చౌదర్ పల్లి అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ రామక్కపేట సెక్టార్ సూపర్వైజర్ స్వరూప ఆధ్వర్యంలో శుక్రవారం గర్భిణీ స్త్రీల, మూడేళ్లలోపు చిన్నారుల ఇళ్ళ సందర్శన చేయడం జరిగింది. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో మూడేళ్లు నిండిన చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఆ తర్వాత పోషణ ప్రతిజ్ఞ చేయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దివ్య, ఏఎన్ఎం పుష్ప, హెల్త్ అసిస్టెంట్ వేణు, అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మి, పలువురు చిన్నారుల తల్లులు, కిశోర బాలికలు ఉన్నారు.
- Advertisement -