- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : బాపట్ల జిల్లా చీరాలలో విషాదం నెలకొంది. సముద్ర స్నానానికి వెళ్లి ఐదుగురు మృతిచెందారు. మరో ముగ్గురిని స్థానికులు రక్షించారు. వివరాల్లోకి వెళ్లే ఆదివారం వీకెండ్ కావడంతో సేదతీరేందుకు పలువురు చీరాల బీచ్కు వచ్చారు. అక్కడ స్నానం చేస్తుండగా అలల తాకిడికి ఎనిమిది మంది సముద్రం లోపలికి కొట్టుకుపోయిరు. ఇది గమనించిన స్థానికులు వారిని రక్షించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ముగ్గురిని రక్షించారు. మరో ఐదుగురు నీటిలో మునిగి మరణించారు.
- Advertisement -