- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. నేటి నుంచి ఈనెల 21 వరకు నామినేషన్లు స్వీకరణ ఉంటుందని ఈసీ పేర్కొంది. ఈనెల 22న నామినేషన్ల పరిశీలన, 24వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. షేక్పేట్ తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు స్వీకరించనున్నారు. కాగా, జూబ్లీహిల్స్నియోజకవర్గంలో మొత్తం 3.98లక్షల మంది ఓటర్లు ఉన్నారు. గెలుపుపై మూడు ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా.. నేడో, రేపు బీజేపీ సైతం క్యాండిడేట్ను ఖరారు చేయనున్నది. మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే.
- Advertisement -