ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యాభోధన అందుతుంది

నవతెలంగాణ – మిరు దొడ్డి 

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన చేయడంతో పాటు ప్రతిరోజు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు కృష్ణమూర్తిని కాంప్లెక్స్ హెడ్మాస్టర్ శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు. మిరుదొడ్డి మండలం కాసులాబాద్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న కృష్ణమూర్తి అనే ఉపాధ్యాయుడు గత నాలుగు సంవత్సరాలుగా ఉదయం 8 గంటలకే విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంతోపాటు ఒక్క సెలవు కూడా ఉపయోగించుకోకపోవడం ఆయన అంకితభావానికి నిదర్శనం అన్నారు. విద్యార్థుల కోసం అనునిత్యం పరితపించే కృష్ణమూర్తి లాంటి ఉపాధ్యాయుడు ప్రభుత్వ పాఠశాలలో పనిచేయడం ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎన్ఓ ప్రవీణ్ బాబు, ఉపాధ్యాయులు పలువురు పాల్గొన్నారు

Spread the love