హాఫ్ సెంచ‌రీతో మెరిసిన‌ పోప్..

నవతెలంగాణ – హైదరాబాద్: భార‌త స్పీడ్‌స్ట‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా యార్క‌ర్ల‌తో ఇంగ్లండ్ బ్యాట‌ర్ల‌ను వ‌ణికిస్తున్నాడు. దాంతో, రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ప‌రాభ‌వం త‌ప్పించుకునేందుకు పోరాడుతోంది. రెండో సెష‌న్‌లో 4 వికెట్ల న‌ష్టానికి 154 ర‌న్స్ కొట్టింది. ప్ర‌స్తుతం ఓలీ పోప్(52) , కెప్టెన్ బెన్ స్టోక్స్(3) క్రీజులో ఉన్నారు. ఇంకా ఇంగ్లండ్ 36 ప‌రుగులు వెన‌క‌బ‌డి ఉంది. భార‌త ఇన్నింగ్స్ ముగిశాక క్రీజులోకి వ‌చ్చిన ఇంగ్లండ్ ఓపెన‌ర్లు బెన్ డ‌కెట్(47), జాక్ క్రాలే(31) బ‌జ్ బాల్ ఆట‌తో విరుచుకుప‌డ్డారు. అయితే.. అశ్విన్ సూప‌ర్ డెలివ‌రీతో క్రాలేను ఔట్ చేసి భార‌త్‌కు బ్రేక్ ఇచ్చాడు.

Spread the love