ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన బస్సు

– ఇద్దరూ యువకులకు తీవ్ర గాయాలు
నవతెలంగాణ భువనగిరి: భువనగిరి-చిట్యాల ప్రధాన రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిట్యాల నుండి భువనగిరికి వస్తున్న ఓ బస్సు భువనగిరి నుండి తొక్కాపూరం వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముఖేష్ కుమార్, రంజన్ కుమార్ లు పట్టణ పరిధిలోని ఓ కంపెనీలో డ్యూటీకి వెళ్తుండగా నలగొండ రోడ్డు డాబాల వద్ద ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. గాయాలైన క్షతగాత్రులను హుటాహుటిన 108 వాహనంలో భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పట్టణ పోలీసులు ప్రమాదానికి జరిగిన కారణాలను తెలుసుకొని వివరాలను నమోదు చేసుకుని వాహనాలను రెండింటిని పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే బస్సు అతివేగంతో ఎదురుగా వస్తున్న బైకుపై దూసుకెళ్లి ఢీ కొట్టిందని స్థానికులన్నారు.

Spread the love