– అశ్వారావుపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణ
నవతెలంగాణ-చండ్రుగొండ
చండ్రుగొండ బస్టాండ్లో నెలకొన్న సమస్యల్ని తీర్చి, అందంగా తీర్చిదిద్దుతామని అశ్వరావుపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణ అన్నారు. శుక్రవారం స్థానిక బస్స్టేషన్ను ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. బస్టాండ్లో చెత్త పడిఉండటం, పిచ్చి మొక్కలు పెరిగి ఉండటాన్ని గమనించి, వెంటనే జిల్లా పంచాయతీ అదికారి రమాకాంత్తో ఫోన్లో మాట్లాడారు. పంచాయతీ కార్యదర్శి స్థానికంగా ఉండటం లేదని గ్రామస్తులు సమస్యలు చెప్పిన పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. బస్టాండ్లో లోపించిన పారిశుధ్యంపై సరియైనా చర్యలు తీసుకోవాలన్నారు. దీనికి స్పందించిన డీపీఓ రమాకాంత్ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాడు. అక్కడ నుంచే కొత్తగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటేశ్వరరావుతో ఫోన్లో మాట్లాడి బాగు చేయాలని ఆదేశించాడు. వారం రోజుల్లో పూర్తిస్థాయిలో మంచిగా చేస్తామని హమీ ఇచ్చాడు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ఎంపీపీ బానోత్ పార్వతి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు దారం గోవిందరెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఉప్పతల ఏడుకొండలు, అంకిరెడ్డి కృష్ణారెడ్డి, తుమ్మలపల్లి సురేష్, బుంగ శ్రీను, సురేష్ పాల్గొన్నారు.