ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

నవతెలంగాణ – ధర్మసాగర్
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఆవిర్భావ దినోత్సవ వేడుకలను  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ధర్మ సాగర్ మండల కేంద్రము లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుర్రపు ప్రసాద్ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాషులూ ప్రజల మధ్యన  జాతీయ పతాకం ఆవిష్కరణ జరిపి తెలంగాణ రాష్ట్ర గీతాలాపన చేస్తూ ఘన వేడుకలు నిర్వహించడం జరిగింది.ముందుగా తెలంగాణ అమరవీరుల స్తూపం నకు పూలమాలలు వేసిఉద్యమంలో అమరుల త్యాగాన్ని స్మరిస్తూ ఘన నివాళులు అర్పించడమైనది. ఈసందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు గుర్రపు ప్రసాద్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడ్డ కాంగ్రెస్ పార్టీ అనుసరణ విధానాన్ని, సోనియమ్మ నాయకత్వ తీరును వివరించారు.అత్యంత సంబురం గా జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, వివిధ స్తాయి నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రజలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Spread the love