నూతనంగా విధుల్లో చేరిన బ్యాంకు మేనేజర్ కు ఘన సన్మానం..

– ఏపీఎం వరదయ్య 

నవతెలంగాణ – నెల్లికుదురు
మండల కేంద్రంలోని ఎస్బిఐ బ్యాంక్ కు నూతనంగా మేనేజర్ విధుల్లో చేరిన ఎల్ శ్రీనివాసుకు శాలువతో ఘనంగా సత్కరించినట్లు ఏపీఎం వరదయ్య తెలిపారు. బుధవారం సీసీ లు వివోఏలు విధుల చేరిన బ్యాంకు మేనేజర్ కు శుభాకాంక్షలు తెలిపి, శాలువతో ఘనంగా సత్కరించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని వివిధ గ్రామాల్లో ఎస్ హెచ్ జి గ్రూపులు ఉన్నాయని మహిళ అభివృద్ధి కోసం మీ వంతు సహకారం అందించాలని కోరినట్టు తెలిపారు. అనంతరం బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ .. మహిళా సంఘాలకు ఇచ్చినటువంటి రుణాలను క్రమం తప్పకుండా రెగ్యులర్గ కట్టే విధంగా మీరు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీసీల పద్మ సురేష్ వెంకన్న వివో ఎల సంగం మండల అధ్యక్షుడు హనుమంతు అశోక్ నసిహత్ వేగం ఇంద్ర అశోక్ కవిత విజయలక్ష్మి రాము ఉష ఉపేందర్ మంజుల స్వప్న తో పటు కొంతమంది ఉన్నారు.
Spread the love