పంచాయతీ ప్రత్యేక అధికారికి ఘన సన్మానం

నవతెలంగాణ –  తుంగతుర్తి
గుడితండ గ్రామ అభివృద్ధికి, ప్రజలకు కనీస సౌకర్యాలు,అవసరాల దృష్ట్యా,ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రామ అభివృద్ధికి తన శక్తి మేరకు కృషి చేస్తానని మండల విద్యాశాఖ అధికారి బోయిని లింగయ్య అన్నారు. శనివారం గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించి మాట్లాడారు. ఈ మేరకు గ్రామ అభివృద్ధిలో అందరూ భాగస్వాములై అభివృద్ధికి తగిన సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా కోరారు. గ్రామంలోని సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే, పై అధికారుల సూచనల మేరకు పరిష్కారం చేస్తానని అన్నారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యదర్శి చింత సురేష్, ఆరాధ్య ఫౌండేషన్ నియోజకవర్గ నాయకులు గుగులోత్ జయపాల్ నాయక్, రామ్ సింగ్, తదితరులు ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన మండల విద్యాశాఖ అధికారి బోయిని లింగయ్యను ఘనంగా సన్మానించారు.
Spread the love