నెల్లికుదురు పంచాయతీ పాలకవర్గానికి ఘన సన్మానం

– పంచాయతీ కార్యదర్శి కె వెంకటేశ్వర్లు

నవతెలంగాణ – నెల్లికుదురు
మండల కేంద్రం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు శాలువాతో ఘనంగా సన్మానించామని ఆ పంచాయతీ కార్యదర్శి కొచ్చర్ల వెంకటేశ్వర్లు తెలిపారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో చిన్న ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని ఐదు సంవత్సరాల కాలం పాటు అభివృద్ధి చేసిన పాలకవర్గానికి గురువారం సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాల కాలంలో నెల్లికుదురు గత కాలంలో చేయని అభివృద్ధి పనులు ఈ ఐదు సంవత్సరాలలో పూర్తి చేశామని అన్నారు. గ్రామ వార్డు సభ్యులతో కలిసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రత్యామ్నాయ కాకుండా పర్మినెంట్ గా ఉండేటట్లుగా ప్రతి వార్డులో సమస్యలను గుర్తించి ప్రజలకు కావాల్సిన సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి అభివృద్ధి చేశామని అన్నారు. మా అభివృద్ధికి సహకరించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు అన్నారు. ప్రతి వాడలో సీసీ రోడ్లు ప్రతి వీధులలో లైట్లు మంచినీరు తదితర వాటిపై కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి చేశామని అన్నారు చేసిన అభివృద్ధి ప్రజల్లో నిలిచిపోయిందని తెలిపారు ఈ అభివృద్ధి చూసి గ్రామంలో ప్రజలు ముందుకు వచ్చి ఎంతోమంది శాలతో ఘనంగా సత్కరించాలని అన్నారు పార్టీలకతీతంగా వార్డు సభ్యులను ఉపసర్పంచ్ ను సర్పంచ్ను శాలువతో సత్కరించడం ఎంతో సంతోషంగా ఉందని ప్రజలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వాణి శ్రీనివాస్ ఉప సర్పంచ్ యాకన్న వార్డు సభ్యులు ప్రజలు సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love