జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం

నవతెలంగాణ ఆర్మూర్: జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఎమర్జెన్సీలో జైలుకి వెళ్లిన వారిని మంగళ వారం రోజు ఘనంగా సన్మానించడం జరిగినది. దేశ రాజ్యాంగ గౌరవానికి అంకితమైన వారికి, భారత ప్రజాస్వామ్య సాంప్రదాయాలపై విశ్వాసం ఉన్న వారికి జూన్ 25 మరపురాని రోజు.  కాంగ్రెస్ భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి, దేశాన్ని జైలుగా మార్చి, ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అణచిన ఆ చీకటి రోజులకు నేటికీ 50 సంవత్సరాలు పూర్తీ కావస్తుంది. ఆ చీకటి రోజులను భారతదేశపు నవ తరం ఎన్నటికీ మరచిపోదు అని బీజేపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆనాడు జైలుకి వెళ్లిన వారు రాజుల దేవి రావినాథ్, బుసని గోవర్ధన్, పుప్పాల రాజేందర్, ఉలిష రాజేశ్వర్, చిలివేరి శ్రీధర్, ఆంజనేయులుకి సన్మానం చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆచార్య జిల్లా బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Spread the love