- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో, దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. అయితే, అండమాన్ నికోబార్ దీవుల్లో మాత్రం లీటర్ పెట్రోల్ కేవలం రూ. 82.46కే లభిస్తోంది. దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ వంటి కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ ధరలు తక్కువగా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణాలు వ్యాట్ లేకపోవడం, కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ డ్యూటీ తక్కువగా ఉండటం, రవాణా, కమీషన్ ఖర్చులు తక్కువగా ఉండటమే. దేశంలోని ప్రధాన నగరాలతో పోలిస్తే ఇక్కడ ధరలు దాదాపు రూ. 25 వరకు తక్కువగా ఉన్నాయి.
- Advertisement -



