ప్రీ క్వార్టర్స్‌లో నంద్యాల జోడీ

A pair of Nandyas in pre-quarters– హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ
హైదరాబాద్‌ : 15వ హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ శుక్రవారం ఘనంగా ఆరంభమైంది. భారత స్టార్‌ క్రీడాకారుడు విష్ణువర్థన్‌, మిస్‌ ఇండియా చాయలు శుక్రవారం జరిగిన సికింద్రాబాద్‌ క్లబ్‌లో హెచ్‌ఓటీఏ టెన్నిస్‌ టోర్నీని ప్రారంభించారు. మెన్స్‌ సింగిల్స్‌, డబుల్స్‌ విభాగాల్లో 30, 40, 50, 60, 70 ప్లస్‌ వయో విభాగాల్లో సుమారు 360 మంది వెటరన్‌ అథ్లెట్లు పోటీపడుతున్నారు. మహిళా అథ్లెట్లు ఓపెన్‌ విభాగంలో తలపడనున్నారు. ఆదివారం అన్ని విభాగాల్లో ఫైనల్స్‌తో టోర్నీ ముగియనుంది. పురుషుల సింగిల్స్‌ విభాగంలో నంద్యాల నర్సింహారెడ్డి, నీలకంఠ జోడీ 8-1తో తొలి రౌండ్లో విజయం సాధించి ప్రీ క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. మెన్స్‌ సింగల్స్‌లోనూ నంద్యాల నర్సింహారెడ్డి తొలి రౌండ్లో 8-6తో విజయం సాధించి ప్రీ క్వార్టర్స్‌కు చేరుకున్నారు. ఆరంభ కార్యక్రమంలో సికింద్రాబాద్‌ క్లబ్‌ ప్రెసిడెంట్‌ గౌతమ్‌ భూపాల్‌, హెచ్‌ఓఏటీ అధ్యక్షుడు నంద్యాల నర్సింహారెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌, టోర్నీ డైరెక్టర్‌ వినీత్‌ సహా తెలంగాణ టెన్నిస్‌ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love