పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

నవతెలంగాణ –  భీంగల్
1995- 96 సంవత్సరం పదవ తరగతి చెందిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ద్వారా కలుసుకున్నారు. ఈ  మేరకు ఆదివారం పట్టణ కేంద్రంలోని లింబాద్రిగుట్టపై ఏర్పాటు చేసుకున్న కార్యక్రమంలో 40 మంది విద్యార్థులు  కలుసుకొని పాత జ్ఞాపకాల నెమరు వేసుకుంటూ ఆనందంగా గడిపారు. సుమారు 28 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులను కలుసుకొని పాత జ్ఞాపకాలను పంచుకోవడం ఆనందంగా ఉందని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఆటపాటలతో వారు ఆనందంగా గడిపారు.

Spread the love