పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..

నవతెలంగాణ – వేములవాడ రూరల్
వేములవాడ పట్టణంలోని జవహర్ లాల్ నెహ్రూ హై స్కూల్ లో 2002-2003వ సంవత్సరంలో పదవతరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. 21 సవంవత్సరాల తర్వాత కలుసుకున్న విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని, అలనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తమకు విద్యా బుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించి, సత్కరించుకున్నారు. ఈ కార్యక్రమంలో  విద్యాసంస్థల చైర్మన్ నరహరిశర్మ, ఉపాధ్యాయులు జగన్మోహన్, వేణు, సూర్యప్రకాష్, రమేష్, శ్రీకాంత్, ఊర్మిళ, ఉమారాణి, విద్యార్థులు కీసరి అర్జున్, నేరెళ్ల మధు, సాగరం మహెష్, సురేష్, అయ్యప్ప, సాయి కృష్ణ , వంశీ, కర్ణ, మురళి, శిరీష, సాత్విక, అనుష, శ్రీనిత, స్వాతి, శ్వేత, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.
Spread the love