వింత వ్యాధితో బాధపడుతూ విద్యార్థిని మృతి

నవతెలంగాణ -తాడ్వాయి
మండలంలోని బంధాల గ్రామపంచాయతీకి చెందిన ఆగబోయిన సంధ్య(15) సుమారు గత కొన్ని సంవత్సరాలు బాధపడుతూ ఉండేది. ఈ విషయాన్ని గమనించిన జిల్లా వైద్యాధికారి మండలం ప్రత్యేక అధికారి ప్రత్యేక కృషితో ములుగు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందింది. మెరుగైన వైద్యం కోసం ఎంజీఎంలో పంపించారు. కొన్ని రోజులు వైద్యం పొందింది. ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి బంధువులు ఉండలేక హాస్పిటల్ లో వైద్యులకు చెప్పకుండానే ఇశ్చార్జి చేయకుండానే ఇంటికి తీసుకెళ్లారు. అనారోగ్యంతో ఉన్న ఆగబోయిన సంధ్య మంగళవారం మృతి చెందింది. మంచి యాక్టివ్ గా ఉండుకుంటూ ఏం వ్యాధో తెలవకుండా గత 15 సంవత్సరాలు ఇబ్బందులు పడి నేడు మృతి చెందడం గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
Spread the love