పాఠశాలకు ఉపాధ్యాయుని కృషి మరువలేనిది..

నవతెలంగాణ – తొగుట
ఉపాధ్యాయుని కృషి వల్ల చందాపూర్ పాఠశాలకు మొదటి బహుమతి రావడం హర్ష నియం అని ప్రధానోపాధ్యాయులు సిద్దేశ్వర్ అన్నారు. బుధవా రం ఆయన మాట్లాడుతూ ప్రాథమికోన్నత పాఠ శాల చందాపూర్ లో తెలుగు లాంగ్వేజ్ పండిట్ అనిశెట్టి సతీష్ కుమార్ ఉపాధ్యాయునిగా రెండు న్నర సంవత్సరాలు సేవ లందించారని అన్నారు. స్కూల్ అసిస్టెంట్ తెలుగు ప్రమోషన్ తీసుకొని శ్రీగిరి పల్లెకు బదిలీ వెళ్తున్నారని తెలిపారు. చందా పూర్ విద్యార్థుల పైన ప్రేమతో విద్యార్థిని విద్యా ర్థులందరికీ నోట్ బుక్స్, ఎగ్జా మ్ ప్యాడ్స్, పెన్నులు అందించారు. సతీష్ పాఠ శాలకు ఎన్నో రకాల అవార్డ్స్ రావడానికి విద్యార్థు ల్లో దాగి ఉన్న ప్రతి భను బయటకు తీసివారిని ప్రోత్సహించారని అన్నారు. గత రెండు సంవత్సరాలుగా ఉగాది పురస్కారాల్లో సిద్దిపేట జిల్లా స్థాయిలో మొదటి బహుమతి చందాపూర్ పాఠశాలకు రావడానికి కృషి చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రాంబాబు, నగేష్, రాజలింగం, అరుణశ్రీ, గంగా తదితరులు ఉన్నారు.

Spread the love