బహ్రెయిన్ పర్యటనకు వెళ్లిన మాజీ మంత్రి, బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. బహ్రెయిన్ ఎయిర్ పోర్టులో బాల్కొండ నియోజకవర్గానికి చెందిన ప్రవాసులు, సన్నిహితులు, గల్ఫ్ కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రశాంత్ రెడ్డికి స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందించి, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.